న్యూఢిల్లీ, జనవరి 21: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన సగం రోజు సెలవును ఢిల్లీ ఎయిమ్స్ ఉపసంహరించుకుంది. ‘రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఓపీతో పాటు అన్ని క్లినికల్ సేవలు జనవరి 22న యథావిధిగా కొనసాగుతాయి’ అని ఆదివారం జారీ చేసిన తాజా మొమొరాండం తెలిపింది. లేడీ హార్డింగ్ వైద్య కళాశాల కూడా సోమవారం అన్ని వైద్య సేవలను అందిస్తామని వెల్లడించింది.