న్యూఢిల్లీ: భారత్-చైనా దేశాల సైనికుల మధ్య తాజాగా చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటనలు చేయనున్నారు. లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్నాథ్ సింగ్ ప్రకటనలు చేసే అవకాశం ఉన్నది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఈ నెల 9న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు సైనికులకు గాయాలయ్యాయి. చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకురావడం ఘర్షణకు దారితీసింది. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చేతగాని తనంవల్లే చైనా రెచ్చిపోతున్నదని విమర్శిస్తున్నాయి.