న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర పర్యాటక శాఖా మంత్రి జీ కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్ అవినీతి రహిత, పేదరిక నిర్మూలన దేశంగా అవతరిస్తుందని చెప్పారు.