జైపూర్, డిసెంబర్ 3: రాజస్థాన్ మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహించిన గోవింద్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు. రమేశ్ చంద్ మీనా, షేల్ మొహమ్మద్, భన్వర్ సింగ్ భాటి, శకుంతల రావత్, విశ్వేంద్ర సింగ్, ఉదయ్లాల్ అంజన తదితరులు ఓడిన మంత్రుల జాబితాలో ఉన్నారు. గెహ్లాట్కు సలహాదారులుగా ఉన్న అయిదుగురితోపాటు మాజీ చీఫ్ సెక్రటరీ నిరంజన్ ఆర్య కూడా ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. అశోక్ గెహ్లాట్ సర్దాపురా నుంచి గెలిచినా 2018తో పోలిస్తే మెజార్టీ తగ్గింది.