ముంబై, అక్టోబర్ 28: తమ డిమాండ్ల సాధనకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శనివారం పిలుపునిచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రకటన చేస్తామంటూ హామీ ఇచ్చి మాట తప్పినట్టు ఆరోపించారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దీక్ష దేశంలోనే గొప్ప ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు. మరాఠాల రిజర్వేషన్ కోసం దయచేసి ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని, శాంతియుత మార్గాల ద్వారా మన డిమాండ్లను పరిష్కరించుకుందామని కోరారు.