జైపూర్: రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 14 ఏండ్ల బాలికను కొందరు దుండగులు హత్య చేసి మృతదేహాన్ని బొగ్గుల బట్టీలో వేసి దహనం చేశారు. బాలిక బుధవారం పశువులను మేపడానికి వెళ్లి తిరిగి రాలేదు.
బంధువులు వెతకగా సమీపంలో ఉన్న బొగ్గు బట్టీల వద్ద బాలిక చెప్పు కన్పించడంతో లోపల చూడగా అక్కడ బాలిక గాజుతో పాటు ఎముకలు కూడా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.