హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఉంటున్న తన అల్లుడి బారి నుంచి తన కుమార్తెను, ఆమె పిల్లలను కాపాడాలని విదేశాంగ మంత్రి జైశంకర్కు హైదరాబాద్ మహిళ సవేరా బేగం విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె సవేరా బేగం(28)కు, అలి హుస్సేన్ (45)తో 2013లో వివాహం జరిపించామని తెలిపారు.
అయితే ఇటీవల మక్కాలో ఉండే తమ అల్లుడు తన కూతురిని, ముగ్గురు మనవండ్లను వేధిస్తున్నాడని ఆమె తెలిపారు. భర్త బారి నుంచి తప్పించుకొని ఒక హోటల్లో తల దాచుకున్న తన కుమార్తెను, ఆమె పిల్లలను కాపాడి, వారిని భారత దేశానికి రప్పించాలని కోరారు. ఇందుకు విదేశాంగ మంత్రి సానుకూలంగా స్పందించారని సవేరా బేగం తెలిపారు.