చెన్నై: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 200 ఏళ్ల నాటి ఆలయంలోకి దళితులు తొలిసారి ప్రవేశించారు. తమిళనాడులోని కాళ్లకురిచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిన్నసేలం పట్టణం సమీపంలోని ఎదుటవాయినాథం గ్రామంలో చారిత్రక వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి దళితులను ఇప్పటి వరకు అనుమతించలేదు. దీంతో వారంతా చాలా కాలంగా నిరసనలు చేస్తున్నారు.
కాగా, ఈ ఆలయం తమ నిర్వాహణలో ఉందని హిందూ మతానికి చెందిన ధర్మాదాయ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో దళిత ప్రజలను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చింది.
మరోవైపు, సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళితుల ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానిక ఎస్సీ ప్రజలు డబ్బు వాయిద్యాల మధ్య గుడిలోకి వెళ్లి పూజలు చేశారు. ఆలయంలోకి అనుమతించడంపై దళిత మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సుమారు 300 మంది పోలీసులను మోహరించారు.
Dalits in Eduathavainatham village in Kallakurichi district, who have been denied entry into the Varadharaja Perumal Temple, were let inside the temple for the first time today. pic.twitter.com/bluUypSKGT
— Prabhakar Tamilarasu || பிரபாகர் தமிழரசு (@pkr_madras) January 2, 2023