ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ఓ 18 ఏండ్ల విద్యార్థి క్యాంపస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడిని అహ్మదాబాద్కు చెందిన దర్శన్ సోలంకిగా పోలీసులు గుర్తించారు. దర్శన్ శనివారమే తన మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తి చేశాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక క్యాంపస్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
దర్శన్ మృతిపై అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్, ఐఐటీ బాంబే ఓ ట్వీట్ చేసింది. దళిత విద్యార్థి దర్శన్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నాము. మూడు నెలల క్రితమే దర్శన్ ఐఐటీ బాంబేలో చేరారు. దర్శన్ది ఆత్మహత్య కాదు.. హత్య అని ట్వీట్లో పేర్కొన్నారు. దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థులకు క్యాంపస్లో భద్రత లేకుండా పోయిందన్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, ఈ విషయంలో కొంత మంది లెక్చరర్లు, ఇతర సిబ్బంది కూడా వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు.