పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కిలోల ద్రాక్ష పండ్లతో అలంకరణ చేశారు. సంక్షతి చతుర్ధి నేపథ్యంలో ద్రాక్ష పండ్లతో ఆలయాన్ని అలంకరించామని అర్చకులు తెలిపారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఈ ద్రాక్ష పండ్లను ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, ఎన్జీవోల్లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు ప్రసాదంగా అందించినట్లు సహ్యాద్రి ఫామ్స్ మెంబర్ మీడియాకు వెల్లడించారు.
Maharashtra | Dagadusheth Halwai Ganapati temple in Pune was decorated with 2,000 kilograms of grapes on the occasion of Sankashti Chaturthi
“The grapes will be distributed to various NGOs & hospitals as Prasada,” said a member of Sahyadri Farms (21.03) pic.twitter.com/cmc5XU2gIs
— ANI (@ANI) March 21, 2022