Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిజ్గాం తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాగల రెండుగంటల్లో మిగ్జాం తుఫాను బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అనంతరం ఆరుగంటల్లోగా వాయుగుండంగా తుఫాను బలహీనపడుతుందని తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో అప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా.. తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు నదుల్లా మారాయి. వర్సాలకు చిన్నారి సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాను తీరం దాటిన సమయంలో రాబోయే 24 గంటల్లో పలుచోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో 8వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలో వర్షాలకు గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా.. తమిళనాడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు చెట్లు నేలకూలరగా.. విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. ఏపీలో 140కిపైగా రైళ్లు, 40 విమానాలు రద్దయ్యాయి.