న్యూఢిల్లీ : దుబాయి మీదుగా భారత్కు వచ్చిన ఉగాండా మహిళ వద్ద ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.14.14కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో మహిళను అధికారులు అడ్డగించి.. తనిఖీలు చేయగా.. 2020 గ్రాముల ఆఫ్ వైట్కలర్లో ఉన్న పౌడర్ను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా హెరాయిన్గా తేలింది.
ఆ తర్వాత సదరు మహిళను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్పోక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద అరెస్టు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఢిల్లీ 100 కిలోల వరకు హెరాయిన్ అధికారులు స్వాధీనం చేసుకొని, 26 మందిని అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తూ.. మాదక ద్రవ్యాల రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.