మందంగా పేరుకుపోయిన బురదలో ఒక భారీ మొసలి ఇరుక్కుపోయింది. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. రెస్క్యూ స్వచ్ఛంద సంస్థతో కలిసి రంగంలోకి దిగారు. ఒక బావిలో ఈ మొసలి ఇరుక్కుపోయింది. క్రేన్ సాయంతో బావిలోకి దిగిన అధికారులు.. చాకచక్యంగా మొసలిని కాపాడారు.
ఈ ఘటన పూణేలోని ఇందాపూర్లో వెలుగు చూసింది. ఈ కాపాడే మిషన్లో మొసలి కూడా చాలా సహకరించిందని, అందుకే సులభంగా దాన్ని కాపాడగలిగామని రెస్క్యూ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఒక స్ట్రెచర్పై మొసలిని పడుకోబెట్టి, జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చామని ఫారెస్టు డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు. స్థానిక సర్పంచ్లు తదితరులు కూడా అధికారులకు సహకారమందించినట్లు తెలుస్తోంది.