లక్నో: కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఒక మొసలి ఆ ఇంట్లోకి వచ్చింది. దీంతో వారంతా భయందోళన చెందారు. పోలీసులకు సమాచారం అందించి రాత్రంతా మేల్కొనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జైతియా గ్రామానికి చెందిన హర్నామ్ సింగ్ శనివారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే రాత్రి 10.30 గంటలకు వరండాలోని మేకల అరుపులు వినిపించాయి. దీంతో హర్నామ్ సింగ్ తల్లి పరిశీలించగా ఒక మొసలి అక్కడ ఉంది. దానిని చూసి భయంతో ఆమె కేకలు వేయగా హర్నామ్ కుమార్తె తలుపు తీసి బయటకు వచ్చింది. అంతలో ఆ మొసలి వారింట్లోకి ప్రవేశించింది. దీంతో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. ఇంట్లోకి వచ్చిన మొసలిని చూసి వారంతా భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు ఈ విషయాన్ని వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందికి తెలిపారు. అయితే రాత్రి వేళ కావడంతో మొసలి చొరబడిన గది తలుపులు మూసివేయాలని వారు సూచించారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసులతో కలిసి ఆ ఇంటికి చేరుకున్నారు. గంటన్నరపాటు శ్రమించి ఆ మొసలిని సురక్షితంగా బంధించారు. స్థానిక కాలువ నుంచి ఆహారం కోసం అది వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. దానిని సురక్షిత ప్రాంతంలో విడిచి పెడతామని చెప్పారు.
WATCH | UP Family Was Sleeping At Night When Crocodile Entered House In Search Of Food pic.twitter.com/cx4Ydwp2pp
— NDTV (@ndtv) October 31, 2022