న్యూఢిల్లీ : పాకిస్తాన్ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారిని ఏకాకిని చేయాలని పేర్కొన్నారు.
పాకిస్తాన్ సరైన రీతిలో వ్యవహరించనంతవరకూ భారత్తో సాధారణ సంబంధాలు సాధ్యం కాదని పాక్కు తెలిసిరావాలని అన్నారు. జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్లో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్పీ హుమయూన్ భట్ మరణించిన నేపధ్యంలో వీకే సింగ్ ఈ వ్యాఖ్యలు చేయాలి.
పాకిస్తాన్ను వేరు చేసి ఒంటరి చేస్తేనే ఏదైనా జరుగుతుంది..ఒత్తిడి తీసుకువరావాలి..కొన్ని సార్లు సినీ రంగానికి చెందిన వ్యక్తులు ముందుకు రావాలి..కొన్ని సార్లు క్రికెటర్లు చొరవ తీసుకోవాలి..ఏం చేసినా మనం పాకిస్తాన్ను ఏకాకిని చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Read More :
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమ బంగారం పట్టివేత