న్యూఢిల్లీ : మణిపూర్ అల్లర్ల (Manipur Violence) నేపధ్యంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడం పట్ల సీపీఐ కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. అఖిలపక్ష భేటీకి తమ పార్టీని ఎందుకు ఆహ్వానించలేదని ఆ పార్టీ నిలదీసింది. తమ పార్టీని మణిపూర్ అంశంపై జరిగే అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలవలేదో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని సీపీఐ ఎంపీ బినయ్ విశ్వం డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి ప్రతినిధిగా తమ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సంతోష్ కుమార్ను ఈ సమావేశానికి వెళ్లాలని పార్టీ కోరిందని చెప్పారు. తీరా తమను అఖిలపక్ష భేటీకి పిలవకపోవడం విస్మయానికి గురిచేసిందని బినయ్ విశ్వం ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో శాంతి కోసం తమ పార్టీ చేసిన కృషిని రాష్ట్ర ప్రజల నుంచి హోంమంత్రిత్వ శాఖ తెలుసుకోవచ్చని ఆయన కేంద్రానికి హితవు పలికారు.
మరోవైపు మణిపూర్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే చొరవ చూపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) డిమాండ్ చేశారు. మణిపూర్ అంశంలో ప్రధాని జోక్యం చేసుకుని అక్కడి పరిస్ధితిని చక్కదిద్దాలని అన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత (Manipur violence) కొనసాగుతూనే ఉంది. ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగరేల్లో మణిపూర్ మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్కు కొందరు నిప్పంటించారు. శుక్రవారం రాత్రి ఆందోళనకారులు ఈ గోడౌన్కు నిప్పంటించడంతో ఇది పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు.
Read More :
Singer Mary Millben: జనగణమణ గీతాన్ని పాడిన అమెరికా సింగర్.. వీడియో