న్యూయార్క్: వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్లో జరిగిన కార్యక్రమంలో.. అమెరికా మేటి సింగర్ మేరీ మిల్బెన్(Singer Mary Millben).. జనగణ మణ గీతాన్ని ఆలపించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆమె భారత జాతీయ గీతాన్ని పాడారు. సభకు హాజరైన జనం కూడా తనతో గొంతుకలిపి పాడడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. జనం గొంతుల్లో ఉన్న ఆ అభిమానాన్ని చూడవచ్చు అన్నారు. భారత జాతీయ గీతాన్ని ఆలపించడం సంతోషంగా ఉందని సింగర్ మేఈ మిల్బెన్ తెలిపారు. ఇది ఎప్పటికీ మరిచిపోని రోజు అని ఆమె తన ట్విట్టర్లో వెల్లడించారు. జనగణమన పాడిన తర్వాత ఆ సింగర్ స్టేజ్పై మోదీ కాళ్లకు పాదాభివందనం చేశారు.
A night I will treasure forever.
Thank you Prime Minister @narendramodi for your kindness and warmth. An honor to sing for you. Thank you @DDNewslive for airing. India and Indian communities across the world, I love you! God bless the #USIndia alliance. #ModiInUS #PMModiUSVisit https://t.co/FosSOtjL87— Mary Millben (@MaryMillben) June 24, 2023