దళితోద్ధరణ లక్ష్యంగా ‘సీఎం దళిత సాధికారత’ పథకం
ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల సాయం విప్లవాత్మకం
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్
బాలాజీనగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఇల్లెందు రూరల్, జూన్ 28: దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు విముక్తి కల్పించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దళిత కుటుంబాలను ఆనంద పరవశులను చేసింది. ‘సీఎం దళిత సాధికారత’ పథకం రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ దళితోద్ధరణకు బాటలు వేశారని వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఇక నుంచి దళిత సమాజం ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగేందుకు సీఎం కేసీఆర్ తాజా నిర్ణయాలు పునాదులు వేస్తున్నాయని కీర్తిస్తూ మండలంలోని బాలాజీనగర్ గ్రామపంచాయతీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళితులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే హరిప్రియ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి దళిత కుటుంబానికి రూ.పది లక్షలు చొప్పున మంజూరు చేయడం ద్వారా తమ అభివృద్ధిని వారే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించినట్లయిందని అన్నారు.