Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,591కు చేరింది.
ఇక, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.80 శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.