న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 14 మంది పిల్లలు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇందులో 12 మందిని కళావతి సరన్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో 53 మంది కొవిడ్తో ఆస్పత్రిలో చేరినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో కొత్తగా 366 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.95 శాతంగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే పిల్లలకు కరోనా సోకడంతో.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. అవసరమైతేనే స్కూళ్లను బంద్ చేస్తామని ప్రకటించారు.