నేపిడా: సైనిక నిర్బంధంలో ఉన్న మయన్మార్ నేత అంగ్సాన్ సూకీ (76) ఆమె వ్యక్తిగత సిబ్బంది కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని ఆమె న్యాయవాది వెల్లడించారు. కరోనా వైరస్ మయన్మార్ను వణికిస్తున్న క్రమంలో ఫిబ్రవరిలో సైనికులు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత సూకీ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట హాజరయ్యే సందర్భాలు మినహా ఎక్కడా కనిపించడం లేదు. సూకీ సహా ఆమె సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చారని సూకీ న్యాయవాది మిన్మిన్ సో తెలిపారు.
అయితే ఆమెకు తొలి డోస్ ఎప్పుడిచ్చారు..ఏ వ్యాక్సిన్ తీసుకున్నారనే వివరాలను ఆమె వెల్లడించలేనదు. రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న సూకీని నిర్బంధంలో ఉంచిన గృహంలో ఆమెతో పాటు వ్యక్తిగత గార్డులు, వంట పనివారు పదిమంది వరకూ ఉన్నారు. మయన్మార్లో కరోనా ఉధృతి పట్ల సూకీ కలత చెందుతున్నారని మిన్మిన్ సో పేర్కొన్నారు.