న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగా మాత్రమే యాక్టివ్ కేసులు చెప్పింది. గతవారంలో దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 17.75శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో లక్షకుపైగా యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.
వైరస్ నియంత్రణకు సంబంధించిన విషయాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల నుంచి 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో 10వేల కంటే తక్కువగా యాక్టివ్ కేసులున్నాయని వివరించారు. దేశంలో మొత్తం ఉన్న యాక్టివ్ కేసుల్లో.. 77శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని అధికారులు వివరించారు. వ్యాక్సిన్లు వేయడం ద్వారా కేసులు గతేడాది కంటే తక్కువగా కేసులు వస్తున్నాయని అధికారులు చెప్పారు.