ముంబై : బాలికను బ్లాక్మెయిల్ చేసి రెండేండ్లుగా సామూహిక లైంగిక దాడికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పుణేలో గురువారం వెలుగుచూసింది. నలుగురిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలికకు రెండేండ్ల కిందట నిందితులు పరిచయమయ్యారని దీంతో బాలిక ఫోటోలు తీసిన నిందితులు ఆపై వాటిని ఆమె తల్లితండ్రులకు చూపుతామని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాలికను ఇటీవల హోటల్కు తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే ఆమె తండ్రిని చంపేస్తామని బాలికను వారు బెదిరించారు. భయంతో రెండేండ్ల పాటు పెదవివిప్పని బాలిక గురువారం ధైర్యం కూడగట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల నిర్వాకం బయటపడింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.