కన్నూర్, ఏప్రిల్ 9: భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, ఈ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దేశ వైవిధ్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు. ‘దేశం సురక్షితంగా ఉండాలంటే ముందు రాష్ర్టాలు సురక్షితంగా ఉండాలి. రాష్ర్టాలను కాపాడుకొన్నప్పుడే దేశం భద్రంగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
సీపీఎం 23వ మహాసభల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ నినాదాలు, విధానాలైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’, ‘ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి’, ఒకే విద్యావిధానాన్ని ప్రస్తావించారు. ‘బీజేపీ దేనికైగా సింగిల్.. సింగిల్ అని అంటున్నది. భవిష్యత్తులో ఇది సింగిల్ పార్టీ విధానానికి దారి తీస్తుంది కావొచ్చు. అప్పుడు బీజేపీ సంతోషంగా ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు.