న్యూఢిల్లీ, ఆగస్టు 18: సెప్టెంబరులోగా పిల్లలకు కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి రావచ్చని ఐసీఎంఆర్-జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ) డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ఆ టీకా 2, 3వ దశ ట్రయల్స్ 2-18 ఏండ్ల వారిపై జరుగుతున్నాయని చెప్పారు. ఈ పరీక్షల ఫలితాలు త్వరలోనే రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు జైడస్ క్యాడిలా సంస్థ వ్యాక్సిన్ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వ్యాక్సిన్ను కూడా పిల్లలకు వేయవచ్చని, ఇది త్వరలోనే అందుబాటులోకి రావచ్చని చెప్పారు.