కరోనాను నియంత్రించేందుకు దేశంలో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అదే సమయంలో 18 ఏళ్లలోపు వయసున్న వారికి వ్యాక్సిన్ వేయడం లేదని, దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఒక హెల్త్ సెంటర్లోని నర్సులు పొరపాటున ఇద్దరు 15 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ వేసేశారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక హెల్త్ సెంటర్లో 15 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చేశారు.
ఆ వెంటనే జరిగిన పొరపాటు గుర్తించిన వైద్యులు.. వారిద్దరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రస్తుతానికి బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలియజేశారు.