న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు. అయినా, అతడి రోగ నిరోధక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులకు గురికాకపోవటం గమనార్హం. వ్యాక్సిన్లు అధికంగా వేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు తమ శక్తిని కోల్పోతాయని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు.
ఫ్రెడ్రిచ్-అలెగ్జాండర్ యూనివర్సిటీ పరిశోధకులు అతడి రోగ నిరోధక కణాలను క్షుణ్ణంగా పరిశీలించగా, అవి ఎలాంటి ప్రభావానికి గురికాలేదని తేలింది. వ్యక్తిగత కారణాల వల్లే ఆ వ్యక్తి అన్ని సార్లు కరోనా టీకాలు వేసుకున్నట్టు అధికారులు చెప్పారు.