దేశంలో కరోనా సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 15,528 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.32 శాతానికి తగ్గినట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 200.33 కోట్ల డోసుల కరోనా టీకాల పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.