హైదరాబాద్, మార్చి 26: స్ప్రింగ్ పరుపుల తయారీ సంస్థ పెప్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 20 ఎక్స్క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ‘గ్రేట్ స్లీప్ స్టోర్స్’ పేరుతో 11 అవుట్లెట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం లో పెప్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరో 20 స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వీటిలో కొన్నింటిని సొంతగా, మరికొన్నింటిని ఫ్రాంచైజ్ పద్ధతిలో నెలకొల్పుతామని కంపెనీ ఫౌండర్ కే మాధవన్ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 స్టోర్లు ఉన్నాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి వీటి సంఖ్యను 160కి పెంచాలని భావిస్తున్నామని తెలిపారు.