న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి ఊరట కలిగించే వార్తను తెలిపారు. ఢిల్లీలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 5వేల మంది యాక్టివ్ కేసులున్నాయని, ఇందులో చాలా తక్కువ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో కేవలం వంద పడకలు మాత్రమే నిండాయని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు డోస్ పొందేందుకు సిద్ధమవుతున్నారని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.