భోపాల్, మే 11: తినడానికి డబ్బులు ఇవ్వాలని కోరిన ఓ ఆరేండ్ల బాలుడిని ఓ పోలీసు గొంతునులిమి చంపాడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో ఇటీవల జరిగింది.
మరణించిన బాలుడు తప్పిపోయాడని, అతని ఆచూకీ కోసం బాలుడి తల్లిదండ్రులు పోలీసు కైంప్లెంట్ కూడా ఇచ్చారని ఎస్పీ తెలిపారు. కాగా, ఒత్తిడిలో ఉండగా, బాలుడు వచ్చి డబ్బులివ్వాలని పదే పదే అడగడంతోనే ఇలా చేశానని నిందితుడు రవిశర్మ తెలిపాడు. పోలీసులు శర్మను అరెస్టు చేశారు.