బెంగళూరు, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇది కల్బుర్గి జిల్లా కమలాపుర తాలూకా చెంట-దుత్తర్గి గ్రామ రహదారి. ఇటీవలే దీన్ని వేశారు. స్థానికులు వట్టి చేతులతో తారు పొరల్ని తేలిగ్గా పెకిలిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంలో అవినీతి తాండవిస్తున్నదనేందుకు మరో మచ్చు తునక ఈ రోడ్డు అని స్థానికులు అంటున్నారు. ‘నలభై శాతం కమీషన్ ఇస్తే తప్ప బిల్లుల్ని అధికారులు చెల్లించటం లేదు. దీనికి మంత్రుల అండ ఉంద’ని గుత్తేదార్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ సాక్షాత్తు ప్రధానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిం ది. 40 శాతం కమీషన్ చెల్లించలేక బీజేపీ కార్యకర్త అయిన ఓ గుత్తేదారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో మంత్రి ఈశ్వరప్ప అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.