రాంచీ: జార్ఖండ్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర కలకలం రేపింది. ఆగస్టు 22 నుంచి 30 వరకు వివిధ కేంద్రాల్లో నిర్వహించిన టెస్ట్ల్లో 11 మంది అభ్యర్థులు చనిపోయారని జార్ఖండ్ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటించింది.
మరణాలపై దర్యాప్తు చేపట్టామని ఉన్నతాధికారి అమోల్ వీ హోమ్కార్ తెలిపారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టనందువల్లే పలువురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.