చండీఘఢ్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. కర్నాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ యాత్రలో ఎముకలు కొరికే చలిలో షర్ట్ లేకుండా డ్యాన్స్ చేయడం కనిపించింది. పార్టీ బ్యానర్లను చేతపట్టిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బస్పైకి ఎక్కి మ్యూజిక్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలారు.
#WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK
— ANI (@ANI) January 8, 2023
యాత్ర పొడవునా రాహుల్ గాంధీ యువత, మహిళలు, బీసీలతో పాటు వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. గిరిజనులతో వారి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఇక రాహుల్ యాత్ర జనవరి 10న శంభు బోర్డర్ మీదుగా పంజాబ్లోకి ప్రవేశించనుంది. 11న ఫతేగఢ్ సాహిబ్లో ప్రార్ధనల అనంతరం భారీ బహిరంగసభను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు.
ఇక సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఢిల్లీ, హర్యానాల మీదుగా సాగుతోంది. జనవరి నెలాఖరులో కశ్మీర్లో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగియనుంది.