న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల్లో ఘోర ప్రభావం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ గుజరాత్ ఫలితాలపై సమీక్షించి, రెండువారాల్లోగా నివేదికను అందించనున్నది. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో గుజరాత్ కాంగ్రెస్కు భారీగా సీట్లు తగ్గిపోయాయి. కేవలం 17 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దేశ చరిత్రలో ఎంతో పేరుతున్న హస్తం పార్టీకి ఇప్పటి వరకు ఇంత తక్కువ సీట్లు ఎన్నడూ రాలేదు.
ఇంతకు ముందు 1990 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యల్పంగా 33 సీట్లు వచ్చాయి. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు రాగా, 2007లో 59 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 77 సీట్లు వచ్చాయి. ఇటీవల 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లలో విజయం సాధించింది. 2002 ఎన్నికల్లో బీజేపీకి 127 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సీట్లు తగ్గుతూ వచ్చాయి. 2017 ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి రికార్డులు తిరగరాస్తూ 156 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.