కర్నాటక కాంగ్రెస్కు ఇది బాంబు లాంటి వార్తే. కాంగ్రెస్ మూల స్తంభాల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2023 ఎన్నికలే తన చివ్వరి ఎన్నికలని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లో ఉంటాను కానీ.. 2023 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే విధానంలో మాత్రం ఉండనని తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ఇక.. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారోనన్నది మాత్రం ఆయన ఇంకా చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో తమ అధిష్ఠానం ఎవర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందో.. ఆ విధానానికే తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు. రాజకీయాల్లో వుంటాను. కానీ ప్రత్యక్ష పోటీకి మాత్రం దూరంగా ఉంటా. రాబోయే ఎన్నికలే ఆఖరి ఎన్నికలు అని ప్రకటించారు.