న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల నియామకం చేపట్టకుండా కేంద్రాన్ని నిలువరించాలంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఈసీ, ఈసీ నియామకాలపై మోదీ సర్కార్ 2023 డిసెంబర్లో తీసుకొచ్చిన చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనందున, దీని ఆధారంగా కేంద్రం కొత్త కమిషనర్ల నియామకం చేపట్టరాదంటూ పిటిషన్లో కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వీలైనంత త్వరలో విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొన్నది.