జైపూర్ : పంజాబ్లో అమరీందర్ సింగ్, నవజోత్ సిద్ధు మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా తన దృష్టిని పంజాబ్పై కేంద్రీకరించింది. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మద్య వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉందన్న బలమైన సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఈ ఉదయం ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ శనివారమే జైపూర్కు చేరుకుని సీఎం అశోక్ గెహ్లాట్ను కలిశారు.
గతేడాది కాలంగా సీఎం అశోక్ గెహ్లాట్పై సచిన్ పైలట్, మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారు. తన లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ తగు చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని సచిన్ పైలట్ ఈ వారం ప్రారంభంలో వ్యక్తపరిచారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానంతో టచ్లో ఉన్నట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ అంశం సహా సచిన్ పైలట్ లేవనెత్తిన సమస్యలను పార్టీ నేరవేరుస్తదని పైలట్ క్యాంప్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.