భోపాల్: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) కన్నెర్ర చేసింది. కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదానీ-హిండెన్బర్గ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనకు దిగాయి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అయితే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | Madhya Pradesh: Congress stage protest against the BJP-led central government over the Adani-Hindenburg issue in Bhopal. Police use water cannons to disperse the protestors. pic.twitter.com/8hxDv6LKi1
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 13, 2023
అదేవిధంగా యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరిత్తించారు. కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. కేంద్రం నియంతృత్వ వైఖరిని అవలంభిస్తోందని మండిపడ్డారు.
#WATCH | Uttarakhand Congress stage protest against the BJP-led central government over the Adani-Hindenburg issue on the first day of the state Budget Session in Bhararisen pic.twitter.com/uJgnE7CEJ7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 13, 2023