Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధలు ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. రాజస్ధాన్లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుంచి సుదర్శన్ రావత్ను, భిల్వారా నుంచి డాక్టర్ రామచంద్ర గుర్జర్ను బరిలో దింపింది.
ఇక ఆరో జాబితాలో కోటా నుంచి ప్రహ్లాద్ గుంజల్, తమిళనాడులోని తిరునల్వేల్ నుంచి డాక్టర్ రాబర్ట్ బ్రూస్లకు చోటు కల్పించింది. మరోవైపు బీజేపీ ఆదివారం 111 మంది అభ్యర్ధులతో 5వ జాబితాను విడుదల చేసింది. అశ్వనీ కుమార్ చూబే, వరుణ్ గాంధీ, వీకే సింగ్ వంటి 37 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించింది.
బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనా రనౌత్, రామాయణ నటుడు అరుణ్ గోవిల్, కలకత్తా హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్, పారిశ్రామిక దిగ్గజం, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ వంటి ప్రముఖులకు అవకాశం కల్పించింది.
Read More :