Mallikarjun Kharge | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రజాస్వామ్య భారత్ను క్రమంగా నియంతృత్వ దేశంగా మార్చటమే మోదీ సర్కార్ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అన్న ఐడియాను గతంలో మూడు కమిటీలు తిరస్కరించాయని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వ నిర్ణయం దేశ సమాఖ్య నిర్మాణానికి తూట్లు పొడవడమేనని విమర్శించారు. నూతనంగా ఏర్పాటుచేసిన కమిటీలో ఎన్నికల సంఘం ప్రతినిధి లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.