భువనేశ్వర్: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం వచ్చే చిట్ట చివరి అవకాశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ గెలిస్తే దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతుందని హెచ్చరించారు.
రష్యాను పుతిన్ పరిపాలిస్తున్నట్లుగా, భారత్ను బీజేపీ పాలిస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన ఈ ఆందోళన వ్యక్తం చేశారు.