రాయ్పూర్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసివచ్చే ప్రతిపక్షాలన్నింటితో కూటమిగా ఏర్పడి పోరాడాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో పొత్తు పెట్టుకొనేందుకు తాము సిద్ధమన్నారు.
గతంలో యూపీఏ కూటమి పార్టీలు నిజాయితీగా కూటమిలో కొనసాగాయని, కానీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరిగిందని చెప్పారు. కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించటాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలతో సమతూకానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.