కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ‘ఎఫ్డీ రేటు 5.1 (తగ్గింది), పీపీఎఫ్ 7.1 (తగ్గుదల), ఈపీఎఫ్ 8.1 (తగ్గింది), ద్రవ్యోల్బణం 6.07 (పెరిగింది), హోల్సేల్ ద్రవ్యోల్బణం 13.11 (పెరిగింది) వీటన్నింటి నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా?’ అంటూ రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు.