ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని కారణంగా కరెంట్ సంక్షోభాన్ని, ఉద్యోగాల సంక్షోభాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని రాహుల్ ఆరోపించారు. మోదీ పాలన ఓ కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని దెప్పి పొడిచారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలన్న దానిపై మోదీ అసమర్థ పాలన ఓ కేస్ స్టడీలా వుందంటూ రాహుల్ పేర్కొన్నారు.
Power Crisis
Jobs Crisis
Farmer Crisis
Inflation CrisisPM Modi’s 8-years of misgovernance is a case study on how to ruin what was once one of the world’s fastest growing economies.
— Rahul Gandhi (@RahulGandhi) May 2, 2022