ఆదిలాబాద్ : బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుర్కపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతులను బోథ్ మండలం టీవీటీ గ్రామానికి చెందిన దేవ్రావు (38), ఆనంద్ రావు (50)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.