ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత సిద్దూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ విరుచుకుపడ్డారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
భగవంత్ మాన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పంజాబ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం చెన్నీ, సిద్దూతో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్ భన్వరీలాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తర్వాతే సిద్దూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.