న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత పౌరుల నైపుణ్యాలు బయటి దేశాలకు సేవ చేయడానికి ఉపయోగ పడుతున్నాయని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత దేశ సాంకేతిక వ్యవస్థపై ఆయన మట్లాడుతూ ‘1.5 కోట్ల జనాభా ఉన్న ఇండియాకు ఒక సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లేకపోవడం నిజంగా సిగ్గు చేటు’ అని అన్నారు.
ఇటీవల ఒక యూట్యూబ్కు ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఎంతోమంది యువ ప్రతిభావంతులున్నారని, కానీ దేశీయ ఆవిష్కరణలకు వారి ప్రతిభను ఉపయోగించుకోవడంలో కేంద్రం విఫలమవుతున్నదని అన్నారు. ‘బహుళజాతి వ్యవస్థల్లో ప్రొగ్రామింగ్, బ్యాంకింగ్, న్యాయ వ్యవస్థ, పరిశ్రమలు, తయారీ రంగం, లాజిస్టిక్ తదితర రంగాల్లో వారి ప్రతిభ ఉపయోగపడుతున్నది’ అని అన్నారు. భారత్ ఇంతవరకు ప్రపంచ స్థాయి సాంకేతిక ఉత్పత్తులను సొంతంగా తయారు చేయలేదని, ఎందుకంటే మన సొంత ప్రతిభ అంతా బయటి దేశాల్లో సేవ చేయడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు.