Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్కు చెందిన కాంగ్రెస్ నేత రోహన్ గుప్తా గురువారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగ నేత ఒకరు తనను వేధిస్తున్నారని తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ మార్చి 22న గుప్తా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
గుప్తా నిష్క్రమణ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో రోహన్ గుప్తా కాషాయ పార్టీలో చేరారు.
గుప్తా చేరికతో గుజరాత్లో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో అన్ని స్ధానాల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Dhoni: ధోనీ బిజినెస్ పార్ట్నర్ దివాకర్ అరెస్టు