న్యూఢిల్లీ: క్రికెటర్ ధోనీ(Dhoni) మిత్రుడు, మాజీ బిజినెస్ పార్ట్నర్ మిహిర్ దివాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. ధోనీ నమోదు చేసిన క్రిమినల్ కేసు ఆధారంగా దివాకర్ను అదుపులోకి తీసుకున్నారు. దివాకర్తో సౌమ్యా దాస్పై రాంచీ జిల్లా కోర్టులో ధోనీ ఫిర్యాదు నమోదు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయిన దివాకర్ను జైపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. క్రికెట్ అకాడమీల ఏర్పాటు కోసం ధోనీ పేరును అక్రమంగా వాడుకున్నట్లు దివాకర్పై ఫిర్యాదులు ఉన్నాయి. పలుమార్లు హెచ్చరించినా.. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా క్రికెట్ అకాడమీలను దివాకర్ ఏర్పాటు చేశాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలకు కూడా దివాకర్ డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 15 కోట్ల మేర అతను ఫ్రాడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. తనకు చెప్పకుండానే దివాకర్ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసినట్లు ధోనీ ఫిర్యాదు చేశాడు. ఐపీసీలోని సెక్షన్ 406, 420,467,468,471, 120B ధోనీ కేసు నమోదు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్, మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్ పై కేసు ఫైల్ చేశాడు.